కొనతం దిలీప్, శేరి సుభాష్ రెడ్డి గుడ్డలూడదీసిన కేసిఆర్ వీరాభిమాని

ఆ యువకుడి పేరు సందీప్ ఠాగూర్. ఆ పేరు వింటే టిఆర్ఎస్ వైరి పక్షాలకు హడల్. పదునైన మాటలతో, చురకత్తుల్లాంటి పోస్టులతో ప్రతిపక్షాలను బెంబేలెల్తిస్తాడు సందీప్ ఠాగూర్. కేసిఆర్ మీద ఈగ వాలినా సహించని తత్వం సందీప్ ది. కేసిఆర్ ను ఎవరైనా పరుషంగా తిడితే.. సందీప్ రంగంలోకి దిగుతాడు. ఇక కేసిఆర్ ను తిట్టిన వ్యక్తికి కానీ, నాయకుడికి కానీ చుక్కలు చూపిస్తాడు. వరుస పోస్టులతో విరుచుకుపడతాడు. అంతగా కేసిఆర్ భక్తుడిగా పేరు తెచ్చుకున్నాడు సందీప్. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను కూడా తట్టుకున్నాడు సందీప్.

కానీ ఎందుకో గత వారం రోజులుగా సందీప్ చిన్నబోయిండు. సోషల్ మీడియాలో పోస్టులు లేవు. బాధతో ఉన్నాడు. తీరా గురువారం ఫేస్ బుక్ లోని తన వాల్ మీద ఒక పోస్టు పెట్టి ఇది పోస్టు కాదు మరణ వాంగ్మూలం అంటూ పేర్కొన్నారు. ఆ పోస్టులో ప్రభుత్వ ఐటి విభాగం డైరెక్టర్ గా పనిచేస్తున్న కొణతం దిలీప్ కుమార్ మీద, కేసిఆర్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి మీద నిప్పులు చెరిగాడు సందీప్. వారి గుట్టు రట్టు చేశాడు. వారు ఎంతగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో.. అధికార కేంద్రం దగ్గర ఉండి ఎలాంటి చిల్లర పనులు చేస్తున్నారో వివరించాడు. కానీ సందీప్ ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి నిలబడే తత్వం ఉన్న నీవు ఏ అఘాయిత్యానికి పాల్పడరాదని ట్రెండింగ్ తెలుగు న్యూస్ సంస్థ కోరుతున్నది.

సందీప్ ఠాగూర్ పెట్టిన పోస్టు కింద ఉంది.

https://www.facebook.com/permalink.php?story_fbid=271278786748854&id=100016002048204

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *