ఎన్టీఆర్ ఘాట్ వల వల ఏడ్చిన మోత్కుపల్లి (వీడియో)

ఈ రోజు హైదరాబాద్ లో  ఎన్టీఆర్ ఘాట్ దగ్గిర  తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు  టిటిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నివాళులర్పించారు. ఈ మధ్య తెలుగు దేశం నాయకత్వానికి ఆయనకు గ్యాప్ పెరిగింది. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ టిఆర్ ఎస్ తో కలవాలని పనికిమాలిన ప్రకటనలు చేసి మోత్కుపల్లి వివాదం సృష్టించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాగా బలమయిన సంస్థ. దీనితో మోత్కుపల్లి మాటలు  తెలంగాణ కార్యకర్తలను బాగా బాధించాయి. టిడిపికి పునర్వైభవం తేవాలని చేస్తున్న తరుణంలో టిఆర్ ఎస్ తో కలవాటని అనడం ఏమిటి? అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి ఈ ఘాట్ వద్ద ఏడుస్తూ అనేక సంచలన విషయాలు చెప్పారు. అదే ఈ వీడియో-

ఎన్టీఆర్ ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరు అయిన మోత్కుపల్లి.

పేదలకు పదవులు, అధికారం రావాలని కోరుకునే మహానేత ఎన్టీఆర్..

పెదవాని దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోయిన మహనీయుడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కుట్రలకు బలి అయ్యారు. ఎన్టీఆర్ పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నారు.

చంద్రబాబు లో మార్పుకోసం మేము చూసాం.

ఎన్టీఆర్ తో చివరి క్షణాల వరకు నేను ఉన్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *