మోదీ నుంచి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి: టీపీసీసీ నేత భ‌ట్టి

గ‌న్‌పార్క్ (హైద‌రాబాద్‌), మే 18 : క‌ర్నాట‌క‌లో ప్రధాని మోదీ నాయకత్వంలో  ప్ర‌జాస్వామ్య‌న్ని భారతీయ జనతా పార్టీ అప‌హాస్యం చేసింద‌ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావవాలని  టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు పిలుపునిచ్చారు. కర్నాటక లో ఆ పార్టీ, గవర్నర్  వ్యవహరిస్తున్నతీరు పట్ల, భట్టి మండిప‌డ్డారు. క‌ర్నాట‌గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారంపై సేవ్ డెమొక్ర‌సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ గ‌న్ పార్క్ వ‌ద్ద నిస‌ర‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో భ‌ట్టి విక్ర‌మార్క కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి పాల్గొన్నారు. క‌ర్నాట‌క‌లో త‌క్ష‌ణం బ‌ల‌మైన కూట‌మిగా ఉన్న జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మికి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *