రెండేళ్ల కిందటి మాట… కదిలిన రాయలసీమ దండు (వీడియో)

సాధారణంగా శంకుస్థాపనలు మంత్రులు ముఖ్యమంత్రులు అట్టహాసంగా చేస్తుంటారు. అయితే, ప్రజలు శంకుస్థాపన చేయడం ఎపుడయినా విన్నారా. అది రాయలసీమలో జరిగింది.సిద్దేశ్వరం అలుగు కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు ఇక్కడి ప్రజలు. ఎవరూ పట్టించుకోలేదు. దీనికే నిరసనగా మేమే శంకుస్థాపన చేసుకుంటాం అని అన్ని వర్గాల ప్రజలు కదిలారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా.  మొక్కవోని ధైర్యంతో అనుకున్నది సాధించే దిశగా ఒక్కక్కరే వందలు వేలయ్యారు శంకుస్థాపన చేసారు. రాజకీయాలను బుట్టదాఖలు చేసారు. ఇది జరిగి రెండేళ్లయింది. అయినా ఉత్తేజ పరుస్తూనే ఉంటుంది. ఇదిగో ఈ వీడియో చూడండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *