పవన్ కళ్యాణ్ తిరుమల టూర్ లో సరికొత్త ట్విస్ట్

జనసేన అధినేత, అగ్రశ్రేణి ఫిల్మ్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సామాన్య భక్తుల మాదిరిగా క్యూలైన్లో దర్శనం చేసుకోవడం ఫ్యాన్స్ లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ గా చర్చనీయాంశమైంది.

పవన్ తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బస్సుయాత్రకు బయలుదేరుతారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజులపాటు పవన్ తిరుమలలోనే ఉండే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు సామాన్య భ‌క్తుల‌తో క‌లిసి శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్. త‌మ‌తో పాటే ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూసి సంతోషం వ్య‌క్తం చేశారు భక్తులు. సామాన్య భ‌క్తుల‌తో క‌లసి స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం త‌న‌కు ఎంతో తృప్తి నిచ్చింద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. అయితే ఆదివారం రోజంతా పవన్ ధాన్యంలో గ‌డ‌ప‌నున్నట్లు చెబుతున్నారు. సోమవారం కొండ‌పై ఉన్న కొన్ని క్షేత్రాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక మరో విషయమేమంటే శ్రీవారి క్షేత్రంలో ఉన్న యోగ నర‌సింహ‌స్వామి స‌న్నిధిలో త‌న‌కు అన్న‌ప్రాస‌న‌ జ‌రిపిన‌ట్లు త‌న త‌ల్లిదండ్రులు త‌రచు గుర్తు చేసేవార‌ని స‌న్నిహితుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు శ‌క్తి వంచ‌న లేకుండా సేవ‌చేసే భాగ్యాన్ని ప్ర‌సాదించ‌మ‌ని శ్రీ వెంక‌టేశ్వ‌రుని ప్రార్ధించిన‌ట్లు తన స‌న్నిహితుల‌కు చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ద్వారా ఎప్పుడు జనాల్లోకి వస్తారా అని లక్షలాది పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బస్సుయాత్రపై తిరుమలలోనే పవన్ ప్రకటన చేస్తారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *