హైదరాబాద్ మేయర్ బొంతుకు అఖిలేష్ ఫ్యాన్స్ షాక్ (వీడియో)

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తోపాటు తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ ఛైర్మన్ చిరుమల్ల రాకేష్ మీద విరుచుకుపడ్డారు సమాజ్ వాదీ పార్టీ నేతలు. బుధవారం హైదరాబాద్ లో అఖిలేష్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అఖిలేష్ అబిమానులు, తెలంగాణ సమాజ్ వాదీ పార్టీ నేతలు వచ్చారు. వారంతా మండుటెండలో అఖిలేష్ కు స్వాగతం పలికేందుకు ఎదురుచూశారు. కానీ పోలీసులు వారిని అనుమతించలేదు. కేవలం టిఆర్ఎస్ నేతలను మాత్రమే అనుమతించారు. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. మా పార్టీ నాయకుడు వస్తే స్వాగతం పలకకుండా అడ్డుకుంటారా అని పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులు వారిని అక్కడినుంచి చెదరగొట్టారు.

ఇక అక్కడ సీన్ కట్ చేస్తే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ ఇంటికి అఖిలేష్ యాదవ్ వస్తారని సమాచారం ఉంది. దీంతో అక్కడికి పెద్ద సంఖ్యలో అఖిలేష్ అభిమానులు, ఎస్పీ నేతలు చేరుకున్నారు. అక్కడే ఉన్న హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చిరుమల్ల రాకేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ నేతలు. పనిలో పనిగా పోలీసుల పై కూడా ఫైర్ అయ్యారు. తమను అవమానించారని సీరియస్ అయ్యారు. అఖిలేష్ అభిమానులు ఎలా నిలదీశారో పైన వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *