బీజేపీ భవన్ ముట్టడించిన నేరెళ్ల శారద.. అరెస్టు

మానేపల్లి రాంబాబు

దేశంలో మహిళల పై జరుగుతున్న దాడులను అరికటడంలో పాలక ప్రభ్యత్వాలు పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరాళ్ల శారద అన్నారు. ఏ ఐ సీ సీ పిలుపు మేరకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ మంగళవారం సాయంత్రం బీజేపీ భవన్ ను ముట్టడించారు.

లో భాగంగా శాంతియుతంగా గాంధీ భవన్ నుండి ప్లే కార్డుల ప్రదర్శన జరిగింది. బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిని  మార్గమధ్యలోనే బేగంబజార్ పోలీసులు కాంగ్రెస్ మహిళలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

హత్యలకు, హత్యాచారాలకు కారకులైన అటువంటి వారిని ఉరిశిక్ష తీయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండాపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారులను సైతం చిదిమేస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు నెరేళ్ల శారద, రాష్ట్ర మహిళ కార్యదర్శులు, మహబూబ్  నగర్ జిల్లా మహిళ అధ్యక్షురాలు అనితా మధుసూదన రెడ్డి, కార్యదర్శులు నాగమణి, రేణుక, అనితాచారి లను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *