టిడిపి కేంద్ర మంత్రుల రాజీనామా

ఏపీకి సహాయం చేసే ఉద్దేశం ఎక్కడా అరుణ్‌ జైట్లీ మాటల్లో కనిపించలేదు అందుకే కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలనే అభిప్రాయానికి వచ్చాం అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

‘టీడీపీకి ఎప్పుడూ పదవులు ముఖ్యం కాదు-మా పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులను రాజీనామా చేయాలని ఆదేశించాం… రేపు రాజీనామా చేస్తారు-,’ అని ఆయన బుధవారం రాత్రి పొద్దుపోయాక చెప్పారు. అంతకు ముందు ఆయన పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. ఆయన చెప్పిన మరికొన్ని విషయాలు:

**కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడమే ఫస్ట్ స్టెప్… తర్వాత మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటాం

**రాజీనామా విషయాన్ని ప్రధానికి చెప్పేందుకు ప్రయత్నించాం… కానీ, ప్రధాని అందుబాటులోకి రాలేదు-

**మేం ఎక్కడా గొంతెమ్మ కోర్కెలు కోరలేదు.

**దేశ రక్షణ నిధులు కూడా ఇమ్మంటున్నారన్న అర్థంలో అరుణ్‌ జైట్లీ మాట్లాడారు.

**మొదట కేంద్ర కేబినెట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాం… తర్వాత ఏంటనేది మళ్లీ చెబుతాం.

**మేం అన్ని ప్రయత్నాలు చేశాం… 29 సార్లు ఢిల్లీ వెళ్లాం… మూడు సార్లు గట్టిగా నిలదీశాం… అయినా న్యాయం చేయలే.

**మేం కేబినెట్‌లో చేరిన ఉద్దేశం నెరవేరనప్పుడు… అందులో ఉండడం సరికాదని బయటకు వస్తున్నాం.

**ఇప్పుడు ఫ్రంట్స్‌ గురించి మాట్లాడే సమయం కాదు.

**రాజీనామా నిర్ణయంతో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూస్తాం… ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేస్తాం-ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర వైఖరిలో మార్పులు రాలేదు… కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *