పార్టీ లో చేరేది ఇపుడే కాదు, సిబిఐ మాజీ జెడి లక్ష్మినారాయణ

మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రత్యే క హోదా డిమాండ్ కు మద్దతు తెలిపారు. ఈ రోజు గుంటూరు జిల్లా యాజలికి ఆయన వచ్చారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్ర మంలో పాల్గొన్నాక ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోదా వల్ల రాష్ట్రానిక ప్రయోజనం ఉందని అన్నారు. . హోదా వల్ల ఏపీకి మేలు జరుగుతుందని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన లక్ష్మినారాయణ చెప్పారు. ఏ పార్టీతో తాను సంప్రదింపులు జరపడం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘ మొదట రాష్ట్రమంతా పర్యటిస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. నా అధ్యయనం పూర్తయ్యాక ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాను,’’ అని ఆయన వెల్లడించారు. లక్ష్మి నారాయణ మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి . అయితే,ప్రజా సేవ కోసం ఐపిఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామాని మహ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట ఆమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *