జగన్ అప్పగించిన బాధ్యతలపై నోరు విప్పిన మాధవ్ (వీడియో)

అనంతపురం, కదిరి మాజీ సిఐ గోరంట్ల మాధవ్ తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి సవాల్ విసిరిన మాధవ్ రాజకీయాల్లోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆయనకి మంచి గుర్తింపు ఉంది. కురుబ సామాజికవర్గానికి చెందిన ఆయన పార్టీలోకి రావడంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

డిపార్ట్మెంట్ లో ఆయనకి ఉన్న ఇమేజ్, యూత్ లో ఆయనకి ఉన్న ఫాల్లోవింగ్ పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ కారణంతోనే ఆయనకి హిందూపూర్ పార్లమెంట్ టికెట్ ఇచ్చే దిశగా సన్నాహాలు చేస్తోంది. మాధవ్ కూడా పార్టీ బలోపేతం కోసం ఇప్పటి నుండే కృషి చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో పార్టీ తనకి ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ తనకి అప్పగించిన బాధ్యతల గురించి వివరించారు. ఆయన వివరాలు వెల్లడించిన వీడియో కింద ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *