లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో దాసు సురేష్ భేటీ

(ప్రశాంత్ రెడ్డి)

17వ లోక్ సభ స్పీకర్ గా నేడు ఎన్నికైన ఓం బిర్లాని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేష్ ఢిల్లీలో కలిసి చేనేత వస్త్రంతో సన్మానించి అభినందించారు.

బీసీ వర్గాలకు సంబంధించిన పలు అంశాలు , వారికి చెందాల్సిన హక్కుల విషయంలో రానున్న సమావేశాలలో బలహీన వర్గాలు లేవనెత్తే అంశాలకు తగిన సమయం కేటాయించాల్సిందిగా దాసు సురేష్ స్పీకర్ ఓం బిర్లా ను అభ్యర్ధించారు.

ఢిల్లీ పర్యటనలో వున్న దాసు సురేష్ , ఈ రోజు బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ రాంలాల్ ని బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్ నందు కలిసి తాము ఈనెల 24 నుండి చేపట్టనున్న “నేతన్నల చలో ఢిల్లీ “కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా సహకరించి , కేంద్ర ప్రభుత్వ పథకాలను నేతన్నల సంక్షేమార్థం త్వరితగతిన విడుదల చేసి తెలంగాణా ప్రభుత్వానికి నిధులు విడుదలచేయడంతోబాటు వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణా ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేసి లక్షలాది మంది నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీజేపీ నాయకులు కెవిఎల్ ఎన్ స్వామి , చేనేత నాయకులు గూడూరు తిరుపతి, మోత్కూరి నవీన్ ఉప్పు కిరణ్ తదితరులు పాల్గొన్నారు