భార్య వివాహేతర సంబంధం… పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

వివాహేతర సంబంధం ఓ పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టింది. చివరకు వారి ప్రాణాలు తీసుకునేలా చేసింది. మహారాష్ట్ర సరిహద్దులోని బల్లార్ పూర్ పట్టణానికి సమీపంలోని కన్నం వార్ వార్డులో రుషికాంత్ అనే అధ్యాపకుడు భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు.

రుషికాంత్ ఐటిఐ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. అతని భార్యకు అదే ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో విషయం తెలుసుకున్న రుషికాంత్ భార్య ప్రవర్తనను మార్చుకోవాలని పలుసార్లు హెచ్చరించినా ఆమెలో మార్పులేదు.

విషయం రుషికాంత్ కు తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువగా అతనితో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారం కింద ఏకంగా భర్త పిల్లలను వదిలి ప్రియునితో కలిసి వెళ్లి పోయింది. వారం రోజుల నుంచి రుషికాంత్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అవమానంగా భావించాడు.

తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కానీ పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచించి మంగళవారం ఉదయం ముందుగా పిల్లలను గొంతు నులిమి చంపాడు. ఆ ఫోటోలను భార్య ఫోన్ కు వాట్సాప్ చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు.

వాట్సాప్ చూసిన భార్య ముందుగా వారి తల్లిదండ్రులకు ఆ తర్వాత బల్లార్ పూర్ పోలీసులకు సమాచారమిచ్చింది. వారు వచ్చి చూసేలోగా దారుణం జరిగిపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారందరిని కలిచివేసింది.

ఇది కూడ చూడండి

https://trendingtelugunews.com/marri-rajashekar-reddy-viral-photos/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *