కరోనా మీద, ఇంతవరకు కేంద్రం ఏం చేసిందంటే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయన ఈ రోజు ఢిల్లీ లో విలేకరులతో  మాట్లాడుతూ కేంద్రం ఇంతవరకు తీసుకున్న కరోనా నివారణ చర్యలను వివరించారు. ఆయన ఏం చెప్పారంటే…
ల్యాండ్ బోర్డర్ వద్ద 19లక్షల మందికి పైగా స్క్రీనింగ్ చేశాం
ఇప్పటి వరకు కరోనా కేసులు 492 (37 డిశ్చార్జయిన కేసులు కలిపి)
కమ్యూనిటీ సర్వైలెన్స్ కింద విదేశాల నుంచి వచ్చి ఇళ్లల్లో ఉన్నవారిని క్వారంటైన్ చేశాం
వారి ఇంటికి మెడికల్, పారా మెడికల్ స్టాఫ్ వెళ్లి పరీక్షలు చేస్తున్నాం, ఇంటి వద్ద పోలీసులను కాపలా పెట్టాం
అలా 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధం చేశాం
ప్రతిరోజూ 20,000 మందికి కరోనా టెస్ట్ చేసే సామర్థ్యం ఏర్పాట చేసుకున్నాం
ఇతర దేశాల్లోని 2,040 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం
సుమారు 48 దేశాల నుంచి భారత ప్రభుత్వ ఖర్చుతో వారిని తీసుకొచ్చాం
పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో రీ-కన్ఫర్మేషన్ చేస్తున్నాం
5 లక్షల పర్సనర్ ప్రొటెక్షన్ కిట్స్, 10 లక్షల మాస్కులు సిద్ధం చేశాం. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండ బ్యాన్ చేశాం
ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రులను కూడా కరోనాపై యుద్ధంలో సిద్ధం చేశాం
కొత్త కిట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలకు నాణ్యమైన కిట్స్ తయారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం
వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చాం
ప్రతి వారం టెస్టింగ్ ల్యాబులను జాబితాలో చేర్చుతున్నాం
అన్ని రాష్ట్రాల్లోని ఎయిమ్స్ ఆసుపత్రులు ఆయా రాష్ట్రాల్లోని మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఆదేశాలిచ్చాం
ఇంకా ఏమన్నారంటే…
అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించాయి.
ప్రస్తుతం మన శరీరంతో మనమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి
ప్రజలు రోడ్లపై పెద్ద ఎత్తున గూమిగూడడం, పోలీసులతో వాదించడం సరికాదు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించాయ
ని, ప్రజలు సహకరించాలని కోరారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలి.
 కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తిచెందే వ్యాధి. కరోనా నుంచి కోలుకున్న 37 మందిని డిశ్చార్చి చేశాము.
‘ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. ప్రస్తుతం మన శరీరంతో మనమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. కరోనా సోకకుండా ప్రతి వ్యక్తి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది’.
‘ఇటలీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. అక్కడి ప్రజలను కరోనా పట్టిపీడిస్తోంది. మన దేశంలోకి ఆలస్యంగా కరోనా ప్రవేశించింది. దీంతో ఇప్పటివరకు తక్కువ నష్టం జరిగింది. విదేశాల నుంచి వచ్చి సొంత ఇళ్లలో ఉన్నవారిని ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నాం’.