గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: కేంద్రానికి టిటిడి వినతి

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం నిర్ణయించింది.తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్న గుడి కో గోమాత కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వస్తున్న స్పందన వల్ల   గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాల్సిన అవసరం ఉందని టిటిడి భావిస్తున్నది.

ఇపుడు జాతీయ చిహ్నాలలో గోవు లేదు. ఈ విషయాన్ని టిటిడి గుర్తించింది. టిటిడి ఈ మధ్య గోవుకుచాలా ప్రాముఖ్యం ఇస్తున్నది.  గత డిసెంబర్ లో ‘గుడి కో గోమాత’ కార్యక్రమాన్ని టిటిడి విజయవాడ దుర్గమ్మ గుడికి ఒక గోవును బహూకరించి ప్రారంభించింది. హిందూ ధర్మపరిరక్షణలో భాగంగా టిటిడి దేశంలో ఆలయాలకు ఒక ఆవును బహూకరించబోతున్నది.

త్వరలో ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణ ట్రస్ట్ టీటీడీకి భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం లేదా యాత్రికుల వసతి సముదాయం లో వారు ఏది కోరితే అది నిర్మించాలని కూడా టిటిడి నిర్ణయించింది.

ఈ విషయం టిటిడి ఛెయిర్మన్  వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం  రూ. 2937.82 కోట్లతో ఆమోదించి టీటీడీ బోర్డు సమావేశం ఆమోదించింది.

ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని కూడా బోర్డు  నిర్ణయించింది.

ఇదే విధంగా టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని కూడా సమావేశం తీర్మానించింది.

తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది.సమావేశంలో అనేక కీలకమయిన నిర్ణయాలు తీసుకున్నారు.

అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ ఆ వివరాలు తెలిపారు.

ముందస్తుగా బుకింగ్ చేసుకున్న భక్తులను ఏప్రిల్ 14వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతిస్తాం

ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలి.

తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశ పెట్టేందుకు ఆమోదం

టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధి విధానాలను నిర్ణయించడం జరిగింది. ఇలాంటి ఆలయాలకు శ్రీవాణీ ట్రస్ట్ నుండి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది.

టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం గా మార్చేందుకు ఆమోదం

బర్డ్ ఆసుపత్రిలోని పాత ఓపిడి భవనం, మొదటి అంతస్తులో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సివిల్, ఎలక్రిటికల్, ఏసీ తదితర అభివృద్ధి పనులకు రూ 9 కోట్ల.మంజూరుకు ఆమోదం

అదేవిధంగా కొత్త ఓపిడి భవనంలో మూడవ అంతస్తు విస్తరణ పనులకు రూ.3.75 కోట్లతో టెండర్ల ఆమోదం

టీటీడీ ప్రసాదాలు, అన్న ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి
ట్యాంకుల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 82.4 మెట్రిక్ టన్నుల నుండి 180. 4 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేందుకు ఆమోదం. తద్వారా నెయ్యి నిల్వలను ఆరు రోజుల నుంచి 14 రోజులకు పెంచుకోవచ్చు.

శ్రీవారి మెట్టు మార్గంలో నడచి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *