తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం…

తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్ రోడ్ లో కొద్ది సేపటి కిందట ప్రమాదం జరిగింది.
మొదటి ఘాట్ రోడ్డులో 6 వ మలుపు వద్ద ఒక టెంపో వాహనం  డివైడర్  ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

 

 

 టెంపోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా విజయవాడకు చెందిన భక్తులు. అయితే,  లోయలోకి పడిపోయి ఉంటే చాలా ఘోరం జరిగి ఉండేది.వివరాలు అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *