హైదరాబాద్ ఔటర్​ రింగ్​ రోడ్డుపై వాహనాలకు అనుమతి

కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ 4 లో రాష్ట్రాలకు పూర్తి గా స్వేచ్ఛనీయడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత నియమాలను సడలిస్తూ ఉంది.  నిన్న టి నుంచి హైదరాబాద్ బయట రాష్ట్రమంతా  ఆర్టీసి బస్సులు తిరుగున్న సంగతి తెలిసిందే.  ఇపుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
 మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్​ఆర్​)పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్ .(హెచ్​జీసీఎల్​) లు నిర్ణయించాయి.
అయితే, కర్ఫ్యూ అమలులో ఉన్న వేళలు(రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ) ఓఆర్​ఆర్​పై కార్లను అనుమతించడం జరగదు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే ఈ నిర్ణయాలను తీసుకుంటున్నట్లు అధికారలు చెప్పారు.
 ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ నిర్వహణ సిబ్బంది కూడా కచ్చితంగా కరోనా వైరస్  నివారణ చర్యలు పాటించాలని అధికారలు అదేశించారు.
ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్​ టాగ్​ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్​ టాగ్​​ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ సూచించింది.
ఓఆర్​ఆర్​పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్​ వెహికిల్స్​)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్​ ప్లాజా సిబ్బంది గుర్తించిన స్థానిక పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.