ఇన్ సైడర్ ట్రేడింగ్ వార్తలు: హైకోర్టు స్టే మీద సుప్రీం కోర్టు స్టే

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు రాయవద్దని ఆంధప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్టర్  మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి,ఎం ఆర్ షాల డివిజన్ బెంచ్ ఈ మేరకుస్టే ఆర్టర్ జారీ చేసింది.
ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  (SIT) నియమించింది. ఈ దర్యాప్తు అధారంగా కట్టిన ఎఫ్ ఐ ఆర్ లోని అంశాలను రిపోర్టు చేయరాదని హైకోర్టు స్టే సెప్టెంబర్ 15న స్టే  ఇచ్చింది.
దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్  చేసింది. భూకుంభకోణం వార్తలను రాయవద్దనడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.  పిటిషనర్ కోరకుండానే హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేయడానికి అభ్యంతరం తెలిసింది.
సిట్ దర్యాప్తు మీద హైకోర్టు విధించిన స్టే విషయంలో జోక్యంచేసుకోనకపోయినా,  వార్తలను రిపోర్టు చేయడాన్ని తప్పు పట్టింది.దీని ఉన్న స్టేని ఎత్తి వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *