తెలంగాణ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమానికి పిలుపు

(నల్లేల రాజయ్య)

నాటి సమైక్యాంధ్రలో ,నేటి ఏడేళ్ళ తెలంగాణ లో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, జంక్షన్ డివిజన్ సాధన అనేది యెన్నో దశాబ్దాల కల.

నేడు ఈ ప్రజా ఆకాంక్ష ను ఈ ప్రాంత పాలక వర్గాల నిర్లక్ష్యం,పాలకుల పట్టింపు లేని తనం వల్ల కేంద్రము పాతర వేయ జూస్తున్నది.

తాజాగా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకి ఈ మేరకు సమాధానం ఇక దేశంలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టె ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వం కు లేదని హోంశాఖ తెలియజేయడం రాజ్యాంగ విరుద్ధం. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడమే. దీనిని తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలి.

రాష్ట్ర విభజన చట్టంలో ఖాజీపేట కు కోచ్ ఫ్యాక్టరీ స్థాపన అనే అంశం ను కేంద్రం పాతర వేయడాన్ని ప్రతిఘటించడానికి విశాలమైన ఐక్య ఉద్యమం నిర్మిద్దాం.

కోచ్ ఫ్యాక్టరీ,డివిజన్ సాధన తో ఈ ప్రాంత అన్ని వర్గాల అభివృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వేలాది ఉద్యోగాల కల్పన,ఈ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లో పూలు అమ్మే కూలి నుండి ఇక్కడి నగరాల్లోని వాణిజ్య, వ్యాపార అభివృద్ధి కూడా ముడిపడి ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయం ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే వరంగల్ తో పాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది.

కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు.

తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఒక వైపు ప్రజా పోరాటాలు, ఈ ప్రాంత రాజకీయ పార్టీలు, MP లు, ప్రజా ప్రతినిధులు రాజీనామా లకైనా సిద్ధపడి పార్లమెంట్లో కేంద్రము పై ఒత్తిడి జమిలీ గా జరగాల్సిన అవసరం ఉంది.

* రైల్వేలను మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూడడము అన్యాయం. దేశము లోని సామాన్య ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ నిర్ణయాలు ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము భారత రవాణా వ్యవస్థకు గుండెకాయ అయిన రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్య దీనిని దేశ ప్రజలందరు వ్యతిరేకించి పోరాడాలని పిలుపునిస్తున్నాము.

ఈ క్రమంలో విశాల ఐక్య ఉద్యమ నిర్మాణం కోసం రైల్వే జేఏసీ-ఖాజీపేట డివిజన్ సాధన కమిటీ-ప్రజా సంఘాలు ఒకే వేదిక పై ఒకే పేరుతో, సమష్టి నాయకత్వములో ఒకే జెండగా ఒకే ఎజెండా గా కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణ పోరాట రూపాలను ఉత్తర తెలంగాణ 10 జిల్లాలో ఉద్యమం ఉదృతం చేసేందుకు ఈ నెల 10 న హన్మకొండ ఫ్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో కోచ్ ఫ్యాక్టరీ సమర సన్నద్ద సదస్సు ను నిర్వహించ తల పెట్టినము.

ఈ సభకు కార్మిక సంఘాల, ప్రజా సంఘాల,విద్యార్థి, యువజన,నిరుద్యోగ యువత,మహిళా, మత, మైనారిటీ, దళిత,ఆదివాసీ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై విశాల ఐక్య ఉద్యమం లో భాగం కావాలని పిలునిస్తున్నాం

డిమాండ్స్:

1.తెలంగాణ కు కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేది లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటన ను వెంటనే వెనక్కి తీసుకోవాలి.

2.తెలంగాణ కు రాజ్యాంగ బద్ధ హక్కు ,పార్లమెంట్ సాక్షి గా హామీ పడ్డ ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చర్యలను వెంటనే చేపట్టాలి.

3.ఉత్తర తెలంగాణ 10 జిల్లాల అభివృద్ధి గుండెకాయ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగ కల్పన అంశమైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలి.

రైల్వే జేఏసీ-కాజీపేట డివిజన్ సమితి-ప్రజా సంఘాలు

ఈ విషయమై ఈ రోజు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన
ప్రెస్ మీట్ లో కాజీపేట రైల్వే డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు గాదె ఇన్నయ్య ,కర్ర యాదవ రెడ్డి,రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రఘువేందర్ ,కొండ్రి నర్సింగరావు,ప్రజా సంఘాల నాయకులు గోపు సోమయ్య ,నల్లెల్ల రాజయ్య,సోమ రామ్మూర్తి,సాయిని నరేందర్ ,జైసింగ్ రాథోడ్ ,నలిగింటి చంద్రమౌళి,ఓంప్రకాశ్ ,జి.కుమార స్వామి,సాగర్ ,కేడల ప్రసాద్ ,జర్నలిస్టు బి.దుర్గా ప్రసాద్ ,ఆంజనేయులు,  సిపియం పార్టీ నాయకులు చొక్కయ్య, న్యూ డెమోక్రసి కార్మిక నాయకులు నున్నా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

(నల్లేల రాజయ్య, వరంగల్ పౌర వేదిక, వరంగల్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *