కరోనా ను అదపు చేయడంలో న్యూజిల్యాండ్ విజయవంతమయింది. అక్కడ పాజిటివ్ కేసులు కనిపించడం లేదు. అనుమానిత కేసుల్లేవు. ఆసుపత్రుల్లో చికిత్సపోందుతున్న కేసులూ లేవు. ఒక్క మాటలో చెబితే చిన్న దేశం, సుందరమయిన దేశం, న్యూజిల్యాండ్ ఇప్పుడు కరోనాను దూరంగా పెట్టింది.
న్యూజిల్యాండ్ ఎంతగా విజయవంతమయిందంటే రెండువారాలుగా అక్కడ నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. ఈ విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆనందంతో చిందులేసినంత పని చేసిందట న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఈ రోజు నుంచి దేశంలో ఎలాంటి కరోనా సంబంధ ఆంక్షలుండవని ప్రకటించారు. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ విధిగా పాటించాల్సిన పని లేదని కూడా ఆమె ప్రకటించారు.
“We have eliminated tranmission of the virus for now. While the job is not done. This is a milestone.” అని చెబుతూ దేశంలో ఉన్న అంక్షలన్నీ ఎత్తివేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.
A big day – thought I’d try and summarise the post cabinet press conference, and preview the week ahead!
Posted by Jacinda Ardern on Monday, June 8, 2020