రేపు మనవడికి కూడా కేసీఆర్ పదవి ఇస్తాడు : రాములు నాయక్ సెటైర్

 మొన్న ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడటం , ముఖ్యంగా దాడిని పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద గురిపెట్టడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కెసిఆర్ తన సహజ శైలిలో కాంగ్రెస్ పిసిసి నేత పేరెత్తకుండా     చురకలంటించారు. ఇపుడు కెసిఆర్ విమర్శలకు సమాధానం చేప్పేందుకు, అసలు కెసిఆర్ చెప్పేవన్నీ కబుర్లు తప్ప అందులో నిజం లేదని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూఉంది.
ఈ  రోజు  మాజీ టీఆరెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత కాంగ్రెస్ నేత, రాములు నాయక్ కెసిఆర్ మీద వ్యంగ్యాస్త్రం సంధించారు.  మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఆయన మాటల్లో…
ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటే చాల బాధేస్తుంది.
ఈ రోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నది పిసిసి అధ్యక్షుడు  ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కేసీఆరే
ఉత్తమ్ కుమార్ సైనికుడు, అలాంటి సైనికుడిని బ్రోకర్ అంటావా ..?
ఒకరిగురించి మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
దేశం కోసం పని చేసిన వారిని అవమానిస్తావా ..!
ఉద్యమ సమయంలో ఇంట్లో పెళ్ళికి కూడా సంకెళ్లతో వచ్చిండు చెరుకు సుధాకర్.
ఉద్యమంలో పీడీ యాక్ట్ పెట్టిండ్రు అదేం పార్టీ అంటావా …!
నీది కుటుంబ పార్టీ  కాదా ,నీ ఇంట్లో వాళ్ళకే ఉన్న పదవులన్నీ ఇస్తున్నావ్.
ఇతర పార్టీ లో నాయకులను కొనుక్కంటూ రాజకీయ వ్యభిచారం చేస్తుంది నువ్వు కదా ..?
నువ్వు ఏమైనా నార్త్ కొరియా కిమ్ అనుకుంటున్నావా !
నీ పార్టీ లో నువ్వు ,నీ కొడుకు ఇద్దరే మాట్లాడుతున్నారు.
తాగు ,దుంకులాడుడు ,కొట్లాడుడు… ఇది రాష్ట్రంలో నేడు పరిస్థితి.
ఈ రోజు నీ ఇంట్లో అందరికి పదవులు ఉన్నాయి ,రేపు నీ మనవడికి ఇస్తావు.
క్యాబినెట్ లో నీ పక్కకు మైనారిటీ ,ఎస్సీ ,ఎస్టీ మంత్రులు ఎక్కడ ..!
టీఆరెస్ పార్టీ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గా మారింది.
దమ్ముంటే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టు ,మాట్లాడు
సీఎం కాకముందు నీ ఆస్తులు ఎంత ..!ఇప్పుడు ఎంత ..? దమ్ముంటే చర్చకు రా.