తెలంగాణ సెటిలర్స్ కూ మీ సాయం అందాలి- జగన్ కు AP TRS విజ్ఞప్తి

విజయవాడ : ఉద్యోగరీత్యా కాని వ్యాపారరీత్యా గాని మరే ఇతర కారణం వల్ల గానీ  ఆంధ్రప్రదేశ్ కు వచ్చి స్థిరపడిన తెలంగాణ వారిని కూడా ఆంధ్రులుగా గుర్తించాలని ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
 ఆదివారం విజయవాడ సింగ్ నగర్ లోని ఎంపి టిఆర్ ఎస్  కార్యాలయంలో  మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ అనే తారతమ్యాలకు ఇక తావులేదని  తెలుగు వారు ఏ రాష్ట్రంలో సెటిలయినా ఆ రాష్ట్ర పౌరులుగా గుర్తించాలని ఆయన  విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ, తెలంగాణ అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ఏవిధంగా చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ఏపీలో కూడా తెలంగాణ వారిని ఆదుకోవాలని  ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.
 లాక్ డౌన్ సమయం లో అటు ఇటు రాకపోకలు లేకపోవడంవల్ల సర్వే సమయంలో అందుబాటులో లేక తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన  వారికి  రేషన్ కార్డులు, పింఛన్లు, తదితర సంక్షేమ పథకాలు అందని విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
 ఇప్పుడు మరలా వెరిఫై చేయించి వారికి కూడా సంక్షేమ ఫలాలు అందేవిధంగా సీఎం సహాయ సహకారాలు అందించాలని ఆదినారాయణ కోరారు.

https://trendingtelugunews.com/english/features/uncertainty-over-andhra-telangana-interstate-bus-services/

జర్నలిస్టుల సంక్షేమానికి విజ్ఞప్తి
లాక్ డౌన్ సమయం లో జర్నలిస్టు మిత్రులు ప్రాణాలకు తెగించి, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వార్తలు సేకరణ, వాటిని ప్రజలకు చేరవేయడంలో ఎంతో కీలక పాత్ర వహించారు. అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆదినారాయణ కోరారు.
 గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారని, చివరికి ప్రభుత్వం మారిందని ఈ ప్రభుత్వం, వారు అప్పోసప్పో చేసి తీసుకువచ్చి వారు పెట్టిన డబ్బులకు గతంలో వాళ్లు చెప్పిన విధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు.
లాక్ డౌన్ సమయం లో సరైన జీతాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొన్ని సందర్భాల్లో ఇల్లు గడవక, ఇంటి అద్దె కట్టలేక చాలామంది అప్పుల పాలయ్యారని కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారిని ఆదుకోవాలని కూడా కోరారు.