మాజీ ఎపి అడ్వకేట్ జనరల్ మీద ఎసిబి కేసు పై స్టే

 మాజీ అడ్వొకేజ్ జనరల్  దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ పెట్టిన  కేసులో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.  తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తుర్వులు జారీ చేసింది.  ఎఫ్ఐఆర్ లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  దమ్మాలపాటి తరపున ముకుల్ రోహత్గీ, శ్యాందివాన్ వాదించారు. ఇది మాజీ అడ్వ కేట్ జనరల్ ను కేస్లులో అక్రమంగా  ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు.