హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మీద మరో 44 మందికి నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం వైసిపి బాపట్ల ఎంపి నందిగం సురేష్ కుమార్, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ లతో కలిపి 49 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో కోర్టు ధిక్కరణ అభియోగం మీద మెత్తం 93 మందికి ఇప్పటి వరకు నోటీసులు అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి సీఐడీ అధికారులు కేసును విచారిస్తున్నారు.
