ఆంధ్రలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే రు.10,000 ఫైన్

అమరావతి: మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘించిన వారిపూ జరిమానాలు భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  వాహనాలను బట్టి తేడాలు లేకుండా బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా విధించేందుకు ఇక ముందు వీలవుతుంది. ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానా విధించారు. కొత్త నియమాల ప్రకారం సెల్ ఫోన్  మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే జరిమానా పదివేలకు పెంచారు.
జరిమానాల వివరాలు:
*వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే – రూ. 750
*సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే – రూ. 750
*అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే – రూ. 5000
*అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే – రూ. 5000
*డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే – రూ. 10,000
*రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5,000
*వేగంగా బండి నడిపితే – రూ. 1,000
*సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10,000
*రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
*రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా – మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000
*పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000
*ఓవర్ లోడ్ – రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం
*వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
*ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే – రూ. 10000
*అనవసరంగా హారన్ మోగించినా – మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా
*రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినినవారికి – రూ. లక్ష