ఆంధ్ర ప్రదేశ్ కరోనా తాజా సమాచారం, కొత్త కేసులు 54, అనంతపూర్ టాప్

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో  కొత్త‌గా  54 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలోచేరిన పాజిటీవ్ కేసులు 1887 కి చేరాయి.
గడచిన 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లా లో 16 కేసులు నమోదు కావడం ఆశ్చర్యం. జిల్లాల వారీగా కొత్త కేసులు వివరాలు:
కర్నూల్ లో 7,గుంటూరు 1, కృష్ణా 6, అనంతపురంలో 16, చిత్తూర్ లో 3, విశాఖలో 11, విజయనగరం లో 1, వెస్ట్ గోదావరి లో 9
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 547 కేసులు, గుంటూరు 374 కృష్ణా జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి.
కరోనా పాజిటివ్ తో 842 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు వైద్యశాఖ తెలిపింది.
వివిధ ఆసుపత్రుల్లో 1004 మందికి  చికిత్స కొనసాగుతూ ఉంది.
గడిచిన 24 గంటల్లో 7320 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారు 41