పవన్ స్టయిలే వేరప్ప (ఎక్స్ క్లూజీవ్ ఫొటో గ్యాలరీ)

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళంలో తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్ లోనే  శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్ష ప్రారంభించారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్‌ ప్రజల మధ్యే దీక్ష చేస్తారు. పవన్‌ దీక్షకు సంఘీభావంగా జిల్లా కేంద్రాల్లో సంఘీభావ దీక్షలు జరుగుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు గంగాధర్‌, అద్దేపల్లి శ్రీధర్‌లు తెలిపారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించేదాకా జనసేన పోరాడుతూనేఉంటుందని వారు వెల్లడించారు. అక్కడి పవన్ ఫోటోల గ్యాలరీ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *