కాపు రిజర్వేషన్లను పూర్తి చేయండి…జగన్ కు ముద్రగడ లేఖ,

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పెండింగులో ఉన్న  రిజర్వేషన్ల గురించి గుర్తు చేశారు.

ఈ రోజు ఆయన జగన్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాలనుఎత్తి చూపుతూ వైసిపికి వోటేస్తే న్యాయం జరగుతుందని తాము భావించామని ఆయన లేఖ లో పేర్కొన్నారు.

‘ … ఓటు ఎవరికి వేస్తే రాక్షస పాలన అంతమవుతుందో మా జాతి ఆలోచించినపుడు మీకు వేస్తే మంచి జరగుతుందని మీ వైపు మొగ్గు చూపడం జరిగిందని అనుకుంటున్నాు. మాకులానికి చెందిన మరొక పార్టీని కూడా పక్కన పెట్టి మా జాతి వోట్లు కొన్ని తప్ప అన్ని చోట్లా మీకు వేసి పట్టం కట్టారని భావిస్తున్నాను. మా జాతి మీకు అధికారం కోసం సహాయం అందించారు. మా జాతి సహకారంపొందారని మీరు పూర్తిగా భావిస్తేనే అసంపూర్తిగా ఉండిపోయిన మా జాతి రిజర్వేషన్ కార్యక్రమం పూర్తి చేయండి. త్వరగా చేయడం వల్ల చదువుకునే పిల్లలకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి మంచి జరగుతుంది,’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.’’