టిఆర్ఎస్ గూటికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

అధికార టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) త్వరలో కారెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది.

నిన్నటి నుంచి జగ్గారెడ్డి తన అనుచరులకు కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లారని ఆయన ఫోన్ ను స్విచ్చాఫ్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన టిఆర్ఎస్ ముఖ్యులతో చర్చించారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నిన్నటినుంచి జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే వార్తలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్నప్పటికీ ఆయన ఇంతవరకు ఖండించకపోవడంపై త్వరలోనే ఆయన చేరబోతున్నారన్న దానికి బలం చేకూరింది. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *