రోజా కు టిడిపి ఎమ్మెల్యే అనిత స్ట్రాంగ్ కౌంటర్

దాచెపల్లి అత్యాచారం ఘటనపై ఆంధ్రా రాజకీయ నేతలు ఇంకా విమర్శలు ప్రతి విమర్శలతో దూషించుకుంటున్నారు. అక్కడ అత్యాచారం చేసిన సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఇంకా మైలేజీ కోసం ఒకరిపై మరొకరు బురద పోసుకుంటున్నారు. తాజాగా టిడిపి ఎమ్మెల్యే అనిత ఈ ఘటనపై మాట్లాడారు. పనిలో పనిగా ఆమె వైసిపి నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రోజాను టార్గెట్ చేసి మాట్లాడారు. అనిత ఏమన్నారో కింద చదవండి.

దాచేపల్లి ఘటన దురదృష్టకరం. దానిపైనా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయటం బాధాకరం. మానవత్వం మంటకలిసి పోయింది. అయేషా మీరా హత్యకేసులో అసలు నిందితులను పక్కన పెట్టి ఒక అమాయకుడిని బలి చేసింది అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబును చెరువులో దూకి చావమంటున్న వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మతి భ్రమించింది. అసలు మాటకొస్తే కట్ట కట్టుకుని వైసీపీ నేతలంతా సముద్రంలో దూకాల్సిన పరిస్థితి వచ్చింది. సామాజిక బాధ్యతగా ఆడిపిల్లల రక్షణ కోసం సీఎం స్వయంగా ర్యాలీ చేస్తున్నారు. మీకు బాధ్యత ఉంటే మీరు ఈరోజు ర్యాలీ కి రండి. రాజకీయాలు చేయటం మాని బాధ్యత గా ఈరోజు జరిగే ర్యాలీ లో పాల్గొనండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *