రవి ప్రకాశ్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: టివి 8 మాజీ సిఇవొ రవిప్రకాశ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అలంద మీడియా ఫోర్జరీ కేసులో రవి ప్రకాశ్ విచారణకు హాజరు కావాల్సిందే నని కోర్టు ఆదేశించింది. రవి ప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన‌ సుప్రీంకోర్టు 41 ఏ నోటీసు కింద విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్ కు ఆదేశిచింది. రకరకాల కేసులను ఎదుర్కొంటున్న రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

రవి ప్రకాశ్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఈ విషయం మీద  హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్ రవి ప్రకాష్ కు సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని హైకోర్టును కూడా  సుప్రీం కోర్టు ఆదేశించింది.

జూన్ 10 న విచారణ జరిపి ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టుకు ఆదేశాలుజారీ చేసింది. అరెస్టు చేయాలంటే 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం తెలిపింది.

 

కంపెనీ నడవకుండా ఇబ్బందులు పెట్టారని బెంచ్ మీద జస్టిస్ మల్హోత్రా వ్యాఖ్యానించారు.  హై కోర్టు ఈ కేసులో మెరిట్ గురించి మాట్లాడలేదని 48 గంటలు టైమ్ ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా జస్టిస్ షా అన్నారు.

అయితే తాము  ఎలాంటి ఉపశమనం కల్పించం.ముందస్తు బెయిల్ ఇవ్వలేమని, కాకపోతే, మెరిట్ పై కేసు డిసైడ్ చేయాలని హైకోర్టు ను కోరుతున్నామని చెప్పారు. కేసు పరిశీలన చేసి హై కోర్టు రిజెక్ట్ కూడా చేయవచ్చునని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *