రెండేళ్ల తరువాత బయట తిరుగుతున్న సోనియా, కర్నాటకలో ర్యాలీ

బెంగళూరు: సుమారు రెండేళ్ల తరువాత యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్నాటక ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడం,బిజెపి నుంచి ప్రధాని మోదీ ప్రచారం చేస్తూ ఉండటంతో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సోనియా సిద్ధమయ్యారు. ఈ మధ్య అనారోగ్యం కారణంగా ఆమె బయట ప్రచారానికి రావడం లేదు.  అయితే, ఇపుడు కర్నాటక  ఎన్నికలు కీలకం అయిన నేపధ్యంలో ఈరోజు బీజాపూర్‌లో సాయంత్రం 4 గంటలకు జరిగే ర్యాలీలో ఆమె పాల్గొననున్నారు. కర్నాటక ఎన్నికల్లో సోనియాకు ఇది తొలి పర్యటన. మరోవైపు కర్నాటకలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటనలు చేశారు. సోమవారం రాహుల్ తొమ్మిదవ, చివరి ర్యాలీ జరిగింది. యూపీ ఎన్నికలకు ముందు 2016 ఆగస్టులో పీఏం మోదీ పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో సోనియా రోడ్ షో నిర్వహించారు. ఈ సమయంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అప్పటినుంచి సోనియా ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *