రాజకీయాలను ప్రక్షాళన చేస్తా, అది మామూలుగా ఉండదు: జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని వైసిపి అధినేత, కొత్తగా సిఎల్ పి నేతగా ఎన్నికమయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇది తీవ్రంగా  ఉంటుందని, మామూలుగా ఉండదని కూడా అన్నారు.

తనని సి ఎల్ పి నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన ప్రసంగిస్తూ ఈ మాట అన్నారు.

 

వైఎస్ఆర్ ఎల్పీ సమావేశంలో వైఎస్ జగన్ కామెంట్స్…

గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచింది వైసీపీ

ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం

151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం

అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనం

50 శాతం కూడా వైసీపీకే పడింది

ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది

మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు
23, ఎంపీలు ముగ్గురు ఇప్పుడు టీడీపీకి మిగిలింది

చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23

దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడు

మన టార్గెట్ 2024 – 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి

 వైసిపిఎల్ పి సమావేశం లో జగన్ ఫోటో గ్యాలరీ

ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి

పెర్ఫార్మెన్స్ చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి

రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తా

మామూలుగా ఉండదు ఆ ప్రక్షాళన

దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా

ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి, అందించాలి

మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా

త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్

వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి

ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరూ

ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు..

2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/chandrababu-and-his-number-23-jagan-reveals-secret-of-23/

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *