‘మహానటి’ బృందానికి చంద్రబాబు ప్రశంసలు(వీడియో)

ఉండవల్లీ లో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం లో మహానటి సినిమా బృందానికి సత్కారం జరిగింది.

పలువురు యూనిట్ సభ్యులు ఈ రోజు ముఖ్యమంత్రిని కలసిని సందర్భంగా ఆయన వారికి సన్మానం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన వారిలో మహానటి పాత్రధారి కీర్తి సురేష్, మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేేశ్వరి-గోవింద రాజులు, నిర్మాత లు స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ అశ్విన్, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, కెమెరామెన్ డైన్, సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ చిత్రబృందం తో పాటు మంత్రులు అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, కాలవ శ్రీనివాస్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఎన్. రాజకుమారి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వల్లభనేని వంశీ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ తరపున రూ.50 లక్షలు రాజధాని నిర్మాణం కోసం స్వప్న దత్ ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *