నేడు జగన్ వైసిపి కీలక సమావేశం

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్ద కొండూరులో ప్రజా సంకల్ప పాదయాత్ర శిబిరం వద్ద సోమవారం సాయంత్రం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో పార్టీ అధినేత  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, పాంతీయ సమన్వయకర్తలతో జగన్ సమావేశమవుతారు.

రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, రాష్ట్ర ప్రయోజనాలను గత నాలుగేళ్ళుగా టిడిపి తాకట్టు పెడుతూవైనం, టీడీపీ భాగస్వామిగా ఉన్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆఖరి ఏడాది, బడ్జెట్‌ ప్రవేశపెట్టాక – తెలుగుదేశం పార్టీ కొద్దిరోజులుగా పార్లమెంటు వేదికగా ఆడుతున్న డ్రామాలు, రాష్ట్రానికి ఏదో సాధించినట్టు చేస్తున్న హడావుడి, టీడీపీ సంబరాలు, ప్రత్యేక హోదానే రాష్ట్రానికి సంజీవని అంటూ గత నాలుగేళ్ళుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు కార్యాచరణ రూపొందించటం.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *