మాజీ కేంద్ర మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు జరిగిన ఈ హత్య రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు ఘాటైన ఆరోపణలు చేసుకున్నారు.
కాగా ఈ హత్యకేసు ప్రభావం ఎన్నికలపై పడుతుంది అని భావించిన హైకోర్టు దీనిపై ఎవరూ మాట్లాడొద్దని రాజకీయ పార్టీలకు సీరియస్ గా హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి అందరి నోటా ఒకటే మాట. బాబాయి హత్య కేసుపై సీఎంగా ఎన్నికైన జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని. ఈ తరుణంలో వివేకా కూతురు సునీత జగన్ ని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అన్నను కలిసిన సునీత, తన తండ్రి కేసు విషయంలో వీలైనంత త్వరగా న్యాయ విచారణ జరిపి దోషులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోమని కోరినట్టు సమాచారం. ఈ విషయంపై రియాక్ట్ ఐన జగన్ డిజిపి సవాంగ్ తో భేటీ అయ్యారు. సీనియర్ రాజకీయ నాయకుడు, తనకు సొంత బాబాయ్ ఐన వివేకా హత్య కేసు విచారణ జరపాలి అని సూచించినట్టు తెలుస్తోంది. దోషులు ఎవరైనా సరే వీలైనంత త్వరగా పట్టుకుని శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు.