మోదీకి తెలుగు వాళ్లు బుద్ధి చెప్పారు, అందుకే బిజెపికి ఈ గతి పట్టింది

కర్నాటక రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నాటక లో ప్రజాస్వామ్యం గెలిచింది బి జె పి నాటకానికి తెరపడింది.

నాటకీయ పరిణామాలు మధ్యలో యడ్యూరప్ప రాజీనామా చేయడం ప్రజల విజయమని ఆయన వ్యాఖ్యానించారు. కర్నాటక పరిణామాలమీద సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం.  తెలుగువారికి అన్యాయం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు చూస్తు ఊరుకోరని, తెలుగు వారు ఉన్న నియోజకవర్గం లో బి జె పి కి ఎదురుదెబ్బ తగిలి, బిజెపికి ఈ పరిస్థితి ఎదురయిందని అన్నారు. డబ్బులతో ముఖ్యమంత్రి పదవి చెపట్డవచ్చనని బి జె పి అనుకుంది అది కుదరకపోవడంతో రాజీనామా చేశారు. బలపరిక్షను దేశం అంతా చూసే విధంగా అన్ని ఛానల్ లో లైవ్ ఇవ్వలని సుప్రీంకోర్టు ఆదేశించడం తో వారి ఎత్తులు ఫలించలేదని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *