ఢిల్లీ వైసిపి దీక్షకు వచ్చిన విజయమ్మ

ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీ పదవులను వదులుకొని న్యూఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసి లోక్‌సభ సభ్యుల దీక్షా శిబిరాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ సందర్శించారు.

ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని ఆసుపత్రికి వెళ్ళి అమె పరామర్శించారు.

పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఉన్నందువల్ల ఆయన ప్రతినిధిగా విజయమ్మ ఢిల్లీ వచ్చారు. ఇతర ఎంపిల ఆరోగ్యం గురించి కూడా ఆమె వాకబు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *