పి చిదంబరం మీద ఉన్న 3 నేరారోపణలు ఇవే…

మొత్తానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మాజీ ఆర్థిక మంత్రి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరాన్ని నాటకీయపరిణామాల మధ్య  అరెస్టు చేసింది. అరెస్టు తప్పదని తెలిసి ముందస్తు బెయిల్ కోసం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మంగళవారం నాడు ఈ అభ్యర్థనను తిరస్కరిచించింది. దీని మీద ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు తక్షణం ఆయన అభ్యర్థనను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించడంతో ఆయనను అరెస్టుకు సిబిఐ కి అవకాశం దొరికింది. బుధవారం రాత్రి ఆయన న్యూఢిల్లీలోని ఎఐసిసికార్యాలయానికి వచ్చారు. తర్వాత ఆయన జోర్ బాగ్ లోని తన ఇంటికి వెళ్ళారు. అక్కడి కి సిబిఐ అధికారులు వచ్చారు. గోడ దూకి లోపలికి ప్రవేశించారు. తర్వాత చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ కార్యాలయానికి తరలించారు. చాలా పెద్ద హంగామా జరిగింది.
బహుశా దేశంలో ఏ నేరస్థుని పట్టుకునేందుకు సిబిఐ, ఇడి ఇంతగా ప్రయత్నించలేదేమో.చిదంబరాన్ని గురువారం నాడు రౌజ్ ఎవన్యూ కోర్టులో హాజరుపరుస్తారు

ఇది కూడా చదవండి: 2010 అమిత్ షా అరెస్టుకు 2019 చిదంబరం అరెస్టు కు చాలా పోలికలున్నాయ్, అవేమిటో చూడండి

మరొక వైపు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం (కాంగ్రెస్ ఎంపి) కూడా ఇదే కేసులో ఉన్నారు. ఇద్దరిని  జైలుకు పంపేందుకు చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చిదరంబరం కామ్ గా బిజెపిలో చేరిపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చే ఉండేది కాదు. అయితే, అలా చేయకపోవడంతో పరిస్థితి తారుమారయింది.
ఇంతకీ చిదంబరం చేసిన నేరం ఏమిటి?
చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరాలు మీద ఉన్న సిబిఐ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలు
1.ఒక విదేశీ పెట్టుబడులు తెచ్చుకునేందుకు  చట్ట వ్యతిరేకంగా  ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు చిదంబరం అనుమతినిచ్చారు.
2.ఈ కంపెనీని మీద చట్టపరంగా చర్య తీసుకోకుండా అడ్డుకునేందుకు కార్తీ చిదంబరం అధికారలను పలుకుబడి ఉపయోగించి ప్రభావితం చేశాడు
3. వీరిద్దరు ఈ కంపెనీని ముడుపులు  (కిక్ బ్యాక్స్) క్విడ్ ప్రో క్వో పద్ధతిలో ముడుపులు స్వీకరించారు.
ఈ కేసేమిటి?
ఆయన, కుమారుడు కార్తీలకు కష్టాలు తెచ్చిన కేసు  INX Media  case గా  పేరు పడింది. ఇంతకీ ఈ కేసేంటో తెలుసా?
దేశంలో భారీగా టివి చానెళ్లు ప్రారంభించేందుకు ఇంద్రాణి ముఖర్జీ అనే పెద్దావిడ INX Media అనే కంపెనీని 2006 లో ప్రారంభించింది.
(ఇంద్రాణి జీవితం చాలా మలుపులు తిరిగి, కూతురి హత్య దాకా వెళ్లి అంటునుంచి జైలు కెళ్లింది. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో కూడా ఆమె  తర్వాత అప్రూవర్ గా మారింది.)
అవి యుపిఎ ప్రభుత్వం నాటి రోజులు. 2007లో ఈ కంపెనీ విదేశీ పెట్టుబడులు తెచ్చుకునేందుకు క్లియరెన్స్ ఇవ్వాలని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (FIPB)కి దరఖాస్తు చేసుకుంది.
ఈబోర్డు కేంద్ర ఆర్థిక శాఖ లో పరిధిలో ఉంటుంది. ఈ దరఖాస్తు చేసుకున్నపుడు ఆర్థిక మంత్రి పి చిదంబరం.
2007 మార్చి 18న బోర్డు సమావేశమయింది.  INX Media రు. 4.62 కోట్ల విదేశీ పెట్టుబడులు తెచ్చుకునేందుకు బోర్డు అనుమతినిచ్చింది. అయితే, INX Media తన దగ్గిర ఉన్న డబ్బును మరొక కంపెనీ INX News లో డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి అనుమతినీయలేదు. ఇది సిబిఐ చెబుతున్న విషయం. విదేశీ పెట్టుబడులున్న ఒక కంపెనీ మరొక కంపెనీలో పెట్టుబడి పెట్టడమే డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంటు. ఇది పరోక్ష పెట్టుబడి కిందకు వస్తుంది.
సిబిఐ ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ ప్రకారం ఎప్ ఐ పిబి అనుమతినీయకపోయినా, నియమాలను ఉల్లంఘించి INX Media (P)Limited డౌన్ స్ట్రీమ్ ఇన్వెస్ట్ మెంటు చేసింది. ఇందులో రెండు అక్రమాలున్నాయన్నది సిబిఐ వాదన.
అవి 1. INX News Private Limited అనే కంపెనీ అక్రమంగా INX Media (P)Limited 26 శాతం ఇన్వెస్ట్ చేసింది. దీనికి అనుమతి లేదు.
2. INX Media (P)Limited కోసం ప్రమోటర్లు నిబంధనలకు వ్యతిరేకంగా రు. 305 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మారిషస్ లోని కంపెనీలనుంచి సేకరించారు. వీళ్లకి అనుమతి ఉండేది కేవలం రు. 4.62 కోట్లకు మాత్రమే. ఈ పెట్టుబడుల సేకరణ కోసం విదేశీపెట్టుబడి దారులకు ఒక షేర్ ధర రు. 800 చొప్పున ప్రీమియం ధరలకు విక్రయించారు.
ఈ రెండు అక్రమాల మీద FIPB 2008లో  INX Media కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఎఫ్ ఐ ఆర్ ప్రకారం, FIPB షోకాజ్ నోటీసు రాగానే INX Media కష్టాల్లో పడింది. దీని నుంచి బయటపడేందుకు కార్తి పి చిదంబరం ( ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు)తో చేతులు కలిపింది.
కార్తీ అపుడు మెస్సర్స్ చెస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ , చెన్నై  డైరెక్టర్ గా ఉన్నారు. FIPB అధికారులతో మాట్లాడి ఈ విషయాన్ని సెటిల్ చేయమని INX Media కార్తీని కోరింది.
ఆర్థిక మంత్రి చిదంబరం పర్యవేక్షణలో పనిచేసే ఎఫ్ ఐ పిబి  305 కోట్ల విదేశీ పెట్టుబడుల మీద చర్య తీసుకోకుండా, వీటికి అనుమతి కోసం తాజాగా దరఖాస్తుచేయాలని  ఐఎన్ ఎక్స్  మీడియా కు సూచించింది.ఇది నేరం అని ఇడి,సిబిఐ వాదిస్తున్నాయి
ఇందులో క్రిమినల్ కాన్ స్పిరసీ ఉందని సిబిఐ ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొంది.
క్రిమినల్ కాన్ స్పిరేసీ ఏమిటంటే కార్తీ చిదంబరం తన ‘పలుకుబడి’ ఉపయోగించి INX Media విదేశీపెట్టుబడులు నియమాలను ఉల్లంఘించిందన్న విషయాన్ని చూసీచూడనట్లు పోవాలని FIPB ని ఒప్పించాలి.
ఈ పని చేసినందుకు కార్తి చిదంబరం నడుపుతున్న మెసర్స్ స్ట్రటెజిక్ కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీకి భారీగా ముడుపులు చెల్లించారని సిబిఐ ఆరోపణ. ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా అక్షరాాలా పది లక్షల రుపాయలు.
INX Media ఈ భారీ మొత్తాన్ని అంటే రు. 10 లక్షలను మెసర్స్ అడ్వాంటేజ్ స్ట్రటెజిక్ కన్సల్టింగ్ కు కన్సల్టెన్సీకి ఫీజుకింద ఇచ్చినట్లు రికార్డులలో రాసుకున్నారని సిబిఐ పేర్కోది.
సిబిఐ దీనికి గురించి ఇలా రాసింది: “Payment was delibrately made to M/S Advantage Strategic Consulting(P) Limited, ుndirectly డontrolled by Karti P Chidambaram for the services rendered by M/S Chess Management Services (P) Limited where Karti Chidambaram was the promoter diretor.
ఒక కంపెనీ సేవలందిస్తే మరొక కంపెనీకి డబ్బు ఎందుకు చెల్లించారంటే… కార్తీ పేరు పైకి రాకుండా ఉండేందుకు అని సిబిఐ చెబుతుూ ఉంది.
కార్తి చిదంబరం మీద ఉన్న మరొక ఆరోపణ ఏమిటంటే INX Media మరొక రు.3.5 కోట్ల పెట్టుబడి మరికొన్ని ఇతర కంపెనీల నుంచి కూడా సేకరించింది. ఈ ‘ఇతర’  కంపెనీలలో కార్తీ చిదంబరానికి  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాత్ర ఉందని సిబిఐ ఆరోపణ.
సిబిఐ మాటల్లో ” information also disclosed that the invoices for aproximately an amount of Rs 3.5 crore were also raised in favour of M/S INX Media in the name of other companies in which Shri Karti P. Chidambaram was having interests directory or indirectly”.
ఈ పెట్టుబడులన్నీ ఫ్రాడ్ అనేది సిబిఐ వాదన.
 చిదంబరం పాత్ర ఏమిటి?
మరి ఈ కేసులోకి ఆర్థిక మంత్రి చిదంబరం ఎలా వచ్చారు?  క్లుప్తంగా చెబితే ఈ కేసులో లంచం రు. 10 లక్షలు, పెట్టుబడులు రు. 3.5 కోట్లు మొత్తం కలిపితే ఈ కేసు విలువ రు. 3 కోట్ల 60 లక్షలు. ఇందులో చిదంబరం పాత్ర ఏమిటంటే రు.60 కోట్లకు మించి విదేశీ పెట్టుబడులు  తెచ్చుకోవాలంటే క్లియరెన్స్ ఇచ్చే అధికారం ఆర్థిక మంత్రికి లేదు. ఆపని చేయాల్సింది  క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్.  దీనిని  విస్మరించి చిదంబరం రు. 305 కోట్ల విదేశీ పెట్టబడి తెచ్చుకునేందుకు అనుమతిచ్చారని,ఇందులో చాలా డబ్బు చేతులు మారి ఉంటుందని  సిబిఐఆరోపణ. అందువల్ల మనీ లాండరింగ్ కూడా జరిగి ఉంటుందని సిబిఐ భావిస్తూ ఉంది.
ఈ కేసు టైమ్ లైన్:
2015 లో ఇన్ కమ్ టాక్స్ శాఖ కార్తీకి సంబంధం ఉందని చెబుతున్న సంస్థల మీద దాడులు జరిపింది.
2016లో ED (Enformcement Directorate) రంగంలోకి దిగి కార్తీ కి చెందిన కంపెనీ అని అరోపణలున్న చెస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ కి కొందరు మరొక 2 లక్షల డాలర్లు చెల్లించారని తమకు ఫిర్యాదు అందిందని పేర్కొంది.
2017 లో క్రిమినల్ కాన్ స్పిరసీ, చీటింగ్, అక్రమ మార్గాల ద్వారా ముడుపులు స్వీకరించడం, ప్రభుత్వాధికారలను ప్రభావితం చేయడం, దుష్ప్రవర్తన ఆరోపణలతో సిబిఐ ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసింది. తర్వాత కార్తీ చిదంబరాన్ని  INX Media కి సాయం చేయడం మీద సిబిఐ ప్రశ్నించింది.(సిబిఐ ఇండియాలో ఎవరినీ అరెస్టు చేసినా ఇవే కేసులంటాయి)
2018లో ED కార్తీకి సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో ఇంద్రాణీ ముఖర్జీని ఢిల్లీ కోర్టు రెండు రోజుల సిబిఐ కస్టడీకి పంపించింది. తర్వాత చెన్నై ఎయిర్ పోర్టులో సిబిఐకార్తీని అరెస్టు చేసింది. ఈ కేసులో నాలుగు గంటల పాటు అనుమానితుడిగా సిబిఐ పి. చిదంబరాన్ని ప్రశ్నించింది. కార్తీకి చెందిన రు.54 కోట్ల ను ఇడి ఎటాచ్ చేసింది.
తర్వాత ఇపుడే జరుగుతున్నదో తెలిసింది. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమయింది.