ఎన్నికలవేళ రెంజల్ లో టిఆర్ఎస్ కవితకు మహిళల షాక్ (వీడియో)

పార్లమెంటు ఎన్నికలవేళ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి, తెలంగాణ సీఎం కుమార్తె కవితకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు నామినేషన్ వేయడం టీఆరెస్ అధిష్టానానికి మింగుడు పడని విషయంగా మారింది. ఈ నేపథ్యంలో రెంజల్ మండలంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన కవితకు మహిళలు మరో షాక్ తగిలింది.

టీఆరెస్ ప్రభుత్వంపై అలాగే ఐదేళ్లుగా నిజామాబాద్ ఎంపీగా వ్యహరించిన కవిత పని తీరుపై ఆమె ఎదుటే అసంతృప్తి వ్యక్తం చేశారు మహిళా ఓటర్లు. పార్టీ పట్ల తమకి ఉన్న వ్యతిరేకతను నిర్మొహమాటంగా కవిత ఎదుట వెళ్లగక్కారు. ఏమి సమాధానం చెప్పలేక అక్కడి నుండి పక్కకి వెళ్లిపోయారు కవిత. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/social-media-post-to-telangana-cm-kcr/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *