ప్రగతి భవన్ ఇన్ సైడ్ వీడియో (ఎక్స్ క్లూజివ్)

టిఆర్ఎస్ అధినేత, సిఎం కేసిఆర్ ప్రగతి భవన్ లో పార్టీ తరుపున స్థానిక సంస్థల కోటాలో పోటీ చేయబోయే అభ్యర్థులకు ఆదివారం బి ఫారాలు అందజేశారు. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉప ఎన్నికలు రానున్నాయి. ఆయా స్థానాల్లో పార్టీ తరుపున రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు. నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపారు.
వారందరికి సోమవారం సాయంత్రం బి ఫారాలు అందజేశారు కేసిఆర్. ప్రగతి భవన్ కు రప్పించుకుని వారికి బి ఫారాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కింద వీడియోలో చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *