కోరుట్ల కాంగ్రెసోళ్లు కర్రలతో ఎలా కొట్టుకున్నారంటే ?(వీడియో)

కోరుట్లలో కాంగ్రెస్ లోకల లీడర్లు కొట్టుకున్నారు. కొట్టుకోవడమంటే చేతలతో కాదు సుమీ.. కర్రలతో ఒకరిపై ఒకరు ఎగబడి దంచుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయలయ్యాయి. కొట్టుకోవడానికి కారణమేమంటే.. చాలా సింపుల్. బస్సు యాత్రలో భాగంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ సహా పెద్ద లీడర్లంతా కోరుట్లకు వస్తున్నారు. వారికి స్వాగతం తెలిపే క్రమంలో మేం ముందంటే మేం ముందంటూ రెండు వర్గాలు తిట్టుకున్నాయి. తిట్ల నుంచి రెచ్చిపోయి దెబ్బలు కొట్టుకునే వరకు వచ్చారు. కర్రలతో కొట్టుకున్నారు. కొమిరెడ్డి రాములు వర్గానికి, జైన్ వెంకట్ వర్గానికి మధ్య ఈ ఘర్షణ జరిగింది. అయితే ఇరు వర్గాలపై పిసిసి చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాగతం పలికేది వదిలేసి కొట్టుకోవడం ఏంటి అని ఆయన మండిపడ్డారు. వీడియోలో ఎలా కొట్టుకున్నారో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *