జలపాతంలో కొట్టుకు పోయిన కర్నాటక శాస్త్రవేత్త (వీడియో)

కర్నాటక మైసూరు జిల్లాలో చుంచునకట్టె జలపాతంలో సిఎఫ్ టిఆర్ఐ కిచెందిన శాస్త్రవేత్త కొట్టుకుపోయాడు. ఆదివారం నాడు కుటుంబంతో విహారయాత్రకు వచ్చిన సోమశేఖర్ (40) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయి కొట్టుకుపోయాడు. ఆయనను తాడు తో రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వర్షాల కారణంగా, సమీపంలోని విద్యద్కేంద్రం మూసివేయడంతో నీటిమట్టం బాగా పెరిగిందని చెబుతున్నారు. దీనితో ఆయనను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కళ్లెదుంటే సోమశేఖర్ కొట్టుకుపోవడంతో కుటుంబం కన్నీరు మున్నీరయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *