టిటిడి ఇవొ గా జెెఎస్ వి ప్రసాద్?

తిరుపతి : సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి జేఎస్ వెంకటేశ్వర ప్రసాద్‌ (1987 బ్యాచ్) ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా ఎపి ప్రభుత్వం నియమించబోతున్నట్లు తెలిసింది.
ఇపుడున ఇవొ గా ఉన్న అనిల్ కుమార్ సింఘల్ (1995 బ్యాచ్)  లను ఢిల్లీలోని ఆంధ్రాభవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపిస్తారని వినికిడి. సింఘల్  కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్ మీద వెళ్లే మూడ్ లో ఉన్నారు.
ఈ రెండు నియామకాల మీద ఒకటి రెండు రోజులలో ఉత్తర్వులు వెలువడవచ్చని తెలిసింది.
ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్‌ ను ఇటీవలే బదిలీ చేశారు. జేఎస్వీ ప్రసాద్‌ స్థానంలో ఇప్పటికే సతీష్‌ చంద్ర ను నియమించారు. టిటిడి నియామకం కోసమే ఆయనకు పోస్టింగ్ఇవ్వలేదని చెబుతున్నారు.