పనామా కెనాల్ నిర్మాణాన్ని సాధ్యం చేసిన ఒక డాక్టర్ ప్రాణ త్యాగం

పనామా కెనాల్ గురించి తెలియని వాళు ఉండరు. రెండు మహా సముద్రాలను, అంటే పసిపిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతూ ఇంజీనీర్లు సృష్టించిన వింత. భూమ్మీదఇదొక ఇంజనీరింగ్ అద్బుతమని చెబుతారు.1994లో సివిల్ ఇంజనీరింగ్ ఏడు వండర్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది.
పనామ దేశంలో ఈ రెండు సముద్రాలను మధ్య ఉన్న చికెన్ నెక్  పొడవునా ఈ కాలువ తవ్వడంతో  20 శతాబ్దం ప్రపంచనౌకా వాణిజ్య కొత్త మలుపు తిరిగింది. ప్రపంచంలో అత్యంత కీలకమయిన ఖరీదైన నౌకా మార్గమయింది.  అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసిన కాలువ కూడా ఇది.
ఈ సముద్రపు ఒడ్డునుంచి ఆ సముద్రపు ఒడ్డుకు దాక ఈ కాలువ పొడవు 77 కిమీ.  సముద్రాలను కలుపుతు ఇంజనీర్లు తవ్విన రెండో కాలువ ఇది. మొదటిది సూయజ్ కెనాల్.
దక్షిణ అమెరికాలోని పనామాలో ఈ చిన్న కాలువ తవ్వడంతో కొన్ని వేల మైళ్ల దూరాన్ని తగ్గించింది.  అమెరికా  ఈస్టుకోస్టు నుంచి వెస్టుకోస్టుకు  సరకులు రవాణా చేయాలంటే నౌకలే చౌకఅయిన మార్గం.  సాధారణంగా నయితే ఆమెరికా తూర్పు తీరంనుంచి పడమటి తీరానికి నౌకలు  వెళ్లాలంటే  దక్షిణ అమెరికాలోని కేప్ హార్న్ ను చట్టుకుని 8వేల నాటికల్ మైల్స్ (అంటే 15,000 కి.మీ)ప్రయాణించాలి. ఈ కెనాల్ తవ్విన తర్వాత ఆమెరికా ఈస్టు కోస్టు, వెస్టు కోస్టుల మధ్య దూరం 3500 నాటికల్ మైల్స్ కు తగ్గింది.ఎంత సమయం, ఇంధన ఆదా అయ్యాయో వూహించండి.
2014 ఈ కెనాల్ నిర్మాణం పూర్తయింది. మొన్న 2014 లో నూరేళ్ల పండగ జరుపుకుంది. ప్రపంచవాణిజ్యంలో అత్యంతకీలకమయిన నౌకామార్గమయిన ఈ కెనాల్ ఇపుడు పనామాదేశం అదుపులో ఉంటుంది. దీని పరిపాలనకు పనామా కెనాల్ అధారిటీ ఏర్పాటు చేశారు.  2015లోఈ కెనాల్ గుండా 12000 నౌకలు, అంటే రోజుకు 32 నౌకలు, దాదాపు రెండుగంటలకు మూడు నౌకలు  ప్రయాణించాయి. 2015 అధారిటీకి  టోల్ ద్వారా వచ్చిన  ఆదాయం 2.6 బిలియన్లు డాలర్లు.పనామా ఖజానాకు చేకూరిన మొత్తం 1 బిలియన్ డాలర్లు. 80 దేశాలకు చెందిన 140 వాణిజ్య మార్గాల  నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణిస్తుంటాయి.
ఇలా చెప్పుకోవడానికి చాలా బాగుటుంది. అయితే, కాలువ నిర్మాణం వెనక  మానవ విషాదం, అంతర్జాతీయ  కుట్రలు,  ఒక పెద్ద సైంటిఫిక్ మోసం కూడా ఉన్నాయంటే ఆశ్చర్యమేస్తుంది.
కాలువ నిర్మాణం
అట్లాంటిక్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లేందుకు దక్షిణ అమెరికా ఖండం మొత్తం చుట్టిపోవడాన్ని తప్పించుకునేందుకు  రెండు సముద్రాలను కలిపుతూ  కాలువ తవ్వాలని  1881లో ఫ్రెంచ్ ప్రభుత్వం భావించింది. అంతకు ముందు పనామా భూమార్గం మీదుగా పసిఫిక్ తీరానికి చేరే ప్రయత్నాలు చేశారు. ఇది చాలా కష్టభూయిష్టమయింది. 16వ,17 వ శతాబ్దాలలో స్పానిష్ వలస వాదులు ఇలాంటి ప్రయత్నాలు చేశారనేందుకు సాక్ష్యంగా పనామా తీరంలోనాటి రేవుల ఆనవాళ్లుకనబడతాయి. ఆరోజులో ఈ భూమార్గంలో ఎదురయిన ప్రధాన అడ్డంకి చావు. అంతుబట్టని జర్వం.మందులేని ఈ జ్వరొ సోకితే చావే పరిష్కారం.  ఈ జ్వరానికి బయపడి పనామా మీదుగా భూమార్గాన పరిపిక్ చేసుకునే ప్రయత్నాలు ఫలించలేదు.  సాహసం చేసిన వాళ్లంతా ఈ వింతజ్వారానికి చనిపోయారు.
1881లో ఫ్రెంచ్ ప్రభుత్వం భూమార్గం వాణిజ్యంసాధ్యంకాదని భావించి రెండు సముద్రాలను కలుపుతూ కాలువ తవ్వేందుకు పూనుకుంది. వారినీ ఈ జ్వరం వదల్లేదు..ఫ్రెంచ్ లక్షమంది కూలీలను రంగంలోకి దించింది. ఇందులో మొత్తం కాలువ నిర్మాణంలోఉన్నవారిలో 85 శాతం మంది ఆసుపత్రి పాలయ్యారు. 22వేల మంది చనిపోయారు. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ప్రాజక్టు పూర్తి చేయలేమనిభావించింది. ఈ వింత జ్వరం తో ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటుంది. జాండిస్ వస్తుంది  అందుకే ఈ జ్వరాన్ని అక్కడి ప్రజలు పచ్చ జ్వరం (Yellow fever/ Yellow Jack ) అని పిలిచే వారు.కాలువ నిర్మాణం అంటేనే కూలీలు మైలు దూరం పారిపోవడం మొదలుపెట్టారు. విపరీతంగా జీతాలుపెంచినా కూలీలు దొరకలేదు.
దీనితో వేలాది కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టాక, రెండు దశాబ్దాలు పనిచేశాక, 287 మిలియన్ డాలర్ల పెట్టుబడి వృధా చేసుకుని ఫ్రెంచ్ వాళ్లు పాజెక్టు నిర్మాణం పనిని ఆపేశారు. ఒక జబ్బు ఆరోజు శక్తివంతమయిన ఫ్రాన్స్ ను ఇలా ఓడించేసింది..
తర్వాత 1904 దాకా కాలువ నిర్మాణం గురించి ఆలోచన ఎవరూ చేయలేదు. 1904లో అమెరికా ముందుకు వచ్చింది. ఇంజనీర్లు పనామా కెనాల్ తవ్వకం పనులు ప్రారంభించారు. వాళ్లు ధైర్యంగా కాలువ పనులు ప్రారంభించేందుకు బాటా వేసింది వైద్య శాస్త్రవేత్తలు. అందులో  ప్రధానమయినవ్యక్తి ఒక డాక్టర్.  క్యూబాలో ఒక మిలిటరీ క్యాంపులోని పనిచేసి, ప్రయోగాన్ని తనమీదే పరీక్షించుకుని ప్రాణ త్యాగం  చేసిన  44  సంవత్సరాల ఫిజిషియన్. డాక్టర్ చనిపోతూ వదలిపెట్టిన డైరీ లో రాసుకున్నతన ప్రయోగం ఫలితాలే పనామా  కాలువ నిర్మాణం చేపట్టేందుకు కారణమయింది.
ఆ డాక్టర్ పేరు జెస్సీవిలియం లేజియర్ (Jesse William Lazear:1866-1900 ). ఈ మధ్యలో ఒక మోసం కూడా జరిగింది. ఆయన డైరీని స్వాదీనంచేసుకున్న ఈ లేజియర్ టీమ్ లీడర్ డైరీలోని డేటాను తనది ప్రచారం చేసుకుని పేరు కొట్టేశాడు.అదే నిజమని ప్రపంచం నమ్మింది.  ఈ మధ్యే ఇది మోసమని బయటపడింది.
అందుకే పనామా కాలువ, రాజకీయ కుట్ర,శాస్త్రప్రపంచపు మోసం, కూలీల త్యాగాలకు ప్రతీకగా నిలబడుతుంది. ముఖ్యంతా లేజియర్ త్యాగం ఎనలేనిది.లేజియర్ డైరీ రాయకపోయిఉంటే,పనామా కాలువ నిర్మాణం ఇంకా ఆలస్యమయ్యేది. అయితే,లేజియర్ కు ఈ క్రెడిట్ దక్కకుండా ఒక పెద్ద శాస్త్రవేత్తే ప్రయత్నించడం విషాదం.
లేజియర్ ప్రయోగాలకు వెళ్లేముందు పనామా కాలువ  రాజకీయం గురించి మూడు ముక్కలు.
ఎల్లోఫీవర్ కు భయపడి కాలువ నిర్మాణాన్ని ఫ్రాన్స్ ఆపేశాక, అక్కడి ఆస్తులను అమెరికా ప్రభుత్వం 1902లో 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాలువ నిర్మాణం అమెరికాకు చాలా అత్యవసరం కాబట్టి, తానే నిర్మించాలనుకుంది. అపుడు పనామా  భూభాగం కొలంబియా  అదీనంలో ఉంది. కాలువ మీద ఎవరికి హక్కులుండాలనే దాని మీద  కొలంబియా, అమెరికా ఒక అంగీకారానికి రాలేకపోయాయి.  అపుడు అమెరికా ఏంచేసింది? పనామాలో స్వాతంత్ర్య పోరాటానికి ఆజ్యం పోసింది. 1903లో పనామాను స్వతంత్ర దేశంగా అమెరికా గుర్తించింది. స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు నిచ్చినందుకు పనామా, కాలువ నిర్మాణానికి అమెరికాకు అనుమతినీయడమేకాదు, కాలువజోన్ మీద శాశ్వత హక్కు కల్పించింది. దీనికి బదులుగా ఆమెరికా పనామాకు 10 మిలియన్  డాలర్ల డబ్బు ముట్టచెప్పింది.  9 సంవత్సరాల తర్వాతి నుంచి యేడాదికి 2,50,000 డాలర్ల యాన్యుటి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం జరిగింది. 1904 మే 4 కాలువ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అపుడు అమెరికా అధ్యక్షుడుధియోడర్ రూజువెల్ట్. 1914 ఆగస్టు 15న కాలువ ప్రారంభమయింది. కాలువ నిర్మాణం పూర్తయ్యేలోపు  మొత్తం 5600 మంది పనివాళ్లు చనిపోయారు. 1994లో దీనిని ప్రపంచంలోని 7 సివిల్ ఇంజనీరింగ్ వండర్స్ లో ఒకటిగా గుర్తించారు. 1999 ఇది పనామా కెనాల్ అధారిటీపరిధిలోకి వచ్చింది. 2010 సెపెంబర్ ఈ కెనాల్ గుండా పదిలక్షల నౌక ప్రయాణించింది.
Jesse Lazear (HSL University of Virginia)
లేజియర్ ప్రాణ త్యాగమేమిటో ఈ లింక్ క్లిక్ చేయండి

ప్రపంచ వాణిజ్య చరిత్రను మార్చేసిన ఒక డాక్టర్ ప్రాణత్యాగం