జగన్ పాదయాత్ర మీద తేనెటీగల దాడి (వీడియో)

ప్రతిపక్ష నేత జగన్మోహన్ ెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఈ రోజు అనుకోని సంఘటన జరిగింది. దీనివల్ల యాత్ర కొద్దిగా ఆటంకానికి గురయింది.ఈ ఘటన కారణంగా కార్యకర్తలు పాదయాత్ర నుంచి పరుగులు తీశారు. విషయం ఏమిటంటే, ఒక ఆకతాయి చేసిన పని వల్ల తెనెతుట్టె కదిలి తెనీటీగలు రోడ్డు మీదకు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద ఈ సంఘటన జరిగింది. ఈరోజు  జగన్ 183రోజు పాదయాత్రకు  ప్రారంభించింది అక్కడి నుంచే.

ఈ క్రమంలోఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టడంతో తేనెటీగలు దాడికి దిగాయి. దీంతో పాదాయత్రకు వచ్చిన కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కొద్ది సేపటి తర్వాత.. తిరిగి పాదయాత్రను కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *