కరోనా పాజిటివ్ క్యాండిడేట్ కు ప్రత్యేక పరీక్షాహాల్

 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి విజయవాడ  ధనేకుల ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న సెకండ్ సెషన్ పరీక్షా కేంద్రాన్నికృష్ణజిల్లా కలెక్టర   ఎ. ఎం డి ఇంతియాజ్,జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్ కుమార్లు సంయుక్తంగా సందర్శించారు.

ఈ సెంటర్ లో 1008 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఇందులో ఒకరు కోవిడ్ బాధితురాలు. ఆమె కు ప్రత్యకంగా గది కేటాయించినట్లు  నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం ఆయన పరీక్ష గదులన్నింటిని పరిశీలించారు.