APకి 1 కోటి 43 లక్షల ఉద్యోగాలు, ఇక పండగే అంటున్న బిజెపి ఎంపి

ఆంధ్రప్రదేశ్ తొందర్లో ఉద్యోగాల జాతర రాబోతున్నదని బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్  నరసింహారావు అంటున్నారు.

విశాఖలో ఈ రోజు  ఒక ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ  రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే పేరు మినహా ఆ రూపేణా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వివిధ రూపాలలో మోదీ ప్రభుత్వం అందించిందని అన్నారు.

దేశవ్యాప్తంగా 32 పారిశ్రామిక కారిడార్లు ఉంటే అందులో ఐదు కారిడార్స్ ఏపీకి ఉన్నాయన్నారు. తూర్పు తీర ప్రాంతం అంతా అభివృద్ది చెందాలన్నదే ప్రధాని లక్ష్యం. ఈ కారిడార్ల వల్ల ఒక కోటి 43 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు  ఉన్నాయి,’ అని ఆయయన చెప్పారు.

ప్రధాని అవాస్ యోజన కింద ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు వచ్చాయని  అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు.

కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం తమ పథకాలుగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.

బీహార్​లో భాజపా గెలవడానికి ప్రధాన కారణం ఉజ్వల పథకమని చెబుతూ పశ్చిమ బెంగాల్ లో కూడా ఉజ్వల పథకం వల్ల ఎక్కువగా లబ్ది పొందుతున్నారని అన్నారు.

18 ఎలక్ట్రానిక్ కారిడార్స్ ఇస్తే రాష్ట్రానికి మూడు క్లస్టర్లు ఇచ్చారని చెప్పారు.

రెవెన్యూ లోటు కింద ఎక్కువగా ఏపీకి కేంద్ర నిధులు వచ్చాయని ఆయన అన్నారు. ఈజ్ ఆప్ డూయింగ్ ద్వారా గత ఐదేళ్లలో చాలా కంపెనీలు ఏర్పాటయ్యాయన్నారు.

కేంద్రం ప్రత్యేకంగా మౌలిక వసతులు మాత్రమే ఏర్పాటు చేస్తోందని.. మరో 8 లక్షల 17 వేల కోట్లు రాష్ట్రానికి రానున్నాయన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా -జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి ఉంటారని, మా మిత్రునితో దోస్తీ మంచి ఫలితాలను ఇస్తోందని వివరించారు.

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పలుమార్లు కమిటీ సమావేశం అయ్యిందని అన్నారు.

జమిలీ ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందని వివరించారు.

కోస్తా పర్యాటకం పై మరిన్ని ప్రణాళికలు కేంద్రం సిద్ధం చేస్తోందని    జివిఎల్ నరసింహారావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *