శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు   ఈ రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న మంత్రికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో బాలాజి స్వాగతం పలికి బస,దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *