జబర్దస్త్ యాంకర్ దురుసు ప్రవర్తన

 

జబర్దస్త్ టిటి ప్రోగ్రాం  యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్‌  ఒక చిన్న పిల్లవాడి మీద దురుసుగా ప్రవర్తించింది. దీనితో పిల్లవాడి తల్లి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ యాంకర్  తన కుమారుడి ఫోన్‌ పగలగొట్టడమే కాకుండా, దుర్భాషలాడిందని ఆమె  ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనసూయపై చర్యలు తీసుకోవాలని కొరింది.

అసలు జరిగింది:

జబర్ధస్త్ యాంకర్ అనసూయ తార్నాక ప్రాంతానికి వచ్చింది. తల్లితో కలిసి తార్నకలో వెళుతున్న ఒక పిల్లవాడు అనసూయను గుర్తుపట్టాడు. ఆమెతో సెల్పీ తీసుకోవాలనుకున్నాడు. మొబైల్ తీసి ఫొటో తీస్తుండగా  అనసూయ చూసింది. అంతే,  ఆమె ఆగ్రహంతో వూగిపోయింది. బాలుడి ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టింది.  దీంతో ఆ తల్లీకొడుకు బిత్తరపోయారు. పిల్లవాడి ఫోన్ ఎందుకు పగలగొట్టావని తల్లి  ప్రశ్నిస్తే వారిద్దరిని అనసూయ దుర్భాషలాడిందని తల్లి పేర్కొంది. తర్వాత అనసూయ కారులో అక్కడ నుంచి   మాయమయింది.  ఈ విషయాన్ని  తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *