కాంగ్రెస్ అధికారంలోకి రాాగానే లక్ష ఉద్యోగాలు

హైదరాబాద్ గాంధీభవన్ లో ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగనున్న నిరుద్యోగ చైతన్య యాత్ర ను పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఐసిసి తెలంగాణ ఇన్ చార్జ్ రామచంద్ర కుంతియా , పిసిసి వర్కింగ్ ప్రెశిడెంట్ భట్టి విక్రమార్క ,అనిల్ యాదవ్ ,పొన్నం ,పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, 49రోజుల్లో అన్ని నియోజకవర్గా లలో ఈ యాత్ర కొనసాగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఉత్తమ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు…

**నిరుద్యుగుల్లో ఈ యాత్ర ద్వారా చైతన్యం తెస్తాం ..ప్రభుత్వ తీరును యువతకు వివరిస్తాం

**ఖాళీలుగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను కేసీఆర్ ఎందుకు భర్తీచేయడలేదో యువతకు వివరిస్తాం.

**4ఏళ్ళల్లో పది శాతం ఉద్యోగాల కూడా భర్తీ చేయలేదు.

**ఒక్క డిఎస్సిని ఎందుకు నిర్వహించలేదో కేసీఆర్ చెప్పాలి

**కేటీఆర్ సూటుబూటు తో విహార యాత్రలు చేస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

**వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తాం

**కేసీఆర్ లా ఒట్టి మాటలు చెప్పం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *